15, ఫిబ్రవరి 2010, సోమవారం

భస్మాసుర హస్తాలు మళ్ళీ మొదలు

విద్యార్థులమని చెప్పుకుని తిరిగే వందలాది భస్మాసురులు,
ప్రజల సొమ్ము జీతాలు గా తింటూ ప్రజలని ఎలా ఇబ్బంది పెట్టాలా అని చూసే హైకొర్టు,
సిగ్గు,ఎగ్గు లేని రాజకీయ నాయకులు,
చీము,నెత్తురు లేని టి.వి.9
సమాజం ఏమైపొయినా నా డబ్బులు పోకూడదు అనుకునే సినీ"కళాకారులు"
అదను చూసుకుని రెచ్చిపోయే మావోయిస్ట్ లు
మూర్ఖులకి ఏమీ చెప్పలేక తలపట్టుకుని కూర్చున్న ఆలోచనాపరులు
ఇదీ స్థూలం గా తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్


సింధూరం సినిమా లో సిరివెన్నెల రాసిన పాటలో రెండు లైన్లు మన కోసమే,

సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనం లో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపి రారే

3 కామెంట్‌లు: