గత 6 నెలలుగా జరుగుతున్న తెలంగాణ ఎపిసోడ్ తో 4-5 గంటలు గా ఉగ్గపెట్టుకుని కూర్చున్న ఒంటేలు లాగా నాలో కూడా భావోద్వేగం తన్నుకొచ్చేసి, శ్రీ శ్రీ టైపు లో నేను సైతం సమైఖ్యాంధ్ర కు బ్లాగునొక్కటి ధారపోసాను. నెమ్మదిగా ఇక జరుగుతున్న పరిణామాలు నన్ను పెద్దగా రెచ్చగొట్టడం మానేసాయి. కె సి ఆర్ గారి తెలంగాణ విడిపొతే 1 లక్ష ఉద్యొగాలు అన్న మాటలు నాకు ఎలా సాధ్యం అన్న ఆలొచన రానివ్వటం లేదు. కొదండరాం "సమైఖ్యాంధ్ర కూలిపొతున్న భవంతి" అన్న మాట మరి " తెలంగాణ రాజకీయ జె యె సి?" అన్న ప్రశ్న ని లేవనెత్తడం లేదు. ఏది ఏమైనా మన వ్యవస్థ లో ఉన్న లోపాలు, విద్వేషాలు, సంకుచిత స్వభావాలు జనాలలో పెరిగిపొతున్న నిర్లిప్తత బయటపడ్డాయి.
అయితే పాసిటివ్ సైడ్ ఏంటంటే ఒక్కడి స్వార్థం ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేసినట్టే ఒక్కడి మంచి ఆలోచనలు ఇంతే మందిని తప్పక ప్రభావితం చేస్తాయి అన్న నమ్మకం కుదిరింది. ప్రజాస్వామ్యం విజయం సాధించినా అపజయం వైపు పరుగులు తీసినా సామాన్య ప్రజలదే భాద్యత. ప్రతీ మధ్యతరగతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వెయ్యాలి. ఎలక్షన్లలో ఓటింగు శాతం పెరగాలి. మద్య తరగతి ప్రజలలో జవాబుదారీ తనం పెరగాలి. రాజకీయ చైతన్యం పెరగాలి. ప్రతీ ఓటరు వారి వారి ఆలొచనలకు దగ్గరిగా ఉన్న రాజకీయపార్టీ కి మద్దతుగా నిలబడాలి.కనీసం ప్రాధమిక సభ్యత్వం అయినా తీసుకుని ఆ పార్టీ కి అండగా నిలబడాలి అవసరం అయితే ప్రశ్నించాలి ఆయా పార్టీ ల జవాబుదారీతనం ని డిమాండ్ చెయ్యాలి. అది కాంగ్రెస్సు కావొచ్చు తె దె పా అవ్వొచ్చు ఇంకేమైన పార్టీ కావొచ్చు ఆఖరికి లఫంగి పార్టీ అయినా కావొచ్చు (అదే స్వయాన ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడ్చే కె సి ఆర్ పార్టీ).
నా మటుకు నేను లొక్ సత్తా పార్టీ లో జాయిన్ అయ్యా. ప్రతీనెలా 100 రూపాయలు నా బ్యాంక్ అక్కౌంట్ నుంచి ఈ సి యెస్ ద్వారా ఆ పార్టీ ఫండ్ కి వెల్తుంది.ఆ పార్టీ లో కూడా నాకు నచ్చనివి కొన్ని ఉన్నాయి కాని జె పి ఆలొచనలకి ప్రభావితుణ్ణి అయ్యాను. ఆ పార్టీ వల్ల మనకి మంచి జరుగుతుందని నమ్మకం ఉంది. మీరు కూడా ఆలొచించండి రాజకీయ నాయకులని తిట్టుకునే ముందు మీలో జవాబుదారీతనం పెంచుకోండి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి